Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

ఠాగూర్
శుక్రవారం, 17 మే 2024 (10:06 IST)
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేసీ బ్రదర్స్ జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. జేసీ సోదరుల ఇంట్లోని పని మనుషులందర్నీ ఇప్పటికే అదుపులో తీసుకున్నారు. దీంతో జేసీ కుటుంబ సభ్యులు ఆకలితో అలమటించాల్సిన దుస్థితి నెలకొంది. తాడిపత్రి పట్టణంలోని వారి నివాసంలో నిత్యం వందల మందికి వారు భోజనాలు పెడతారు. అలాంటిది.. తాడిపత్రి పోలీసుల చర్యల కారణంగా వారికే భోజనం పెట్టేవారు కరవయ్యారు. 
 
ఈ నెల 14వ తేదీన తాడిపత్రిలో టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటిపై దాడి జరిగిన అనంతరం.. అక్కడ పెద్ద ఎత్తున ఘర్షణలు మొదలయ్యాయి. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. తాడిపత్రికి వచ్చిన రాజంపేట డీఎస్పీ చైతన్య.. జేసీ ఇంట్లో పని మనుషులందరినీ అరెస్టు చేశారు. వారి ఇంటిని ఆధీనంలోకి తీసుకున్నారు. దివాకర్ రెడ్డి భార్య విజయమ్మ, సోదరి సుజాతమ్మ కొద్దికాలంగా అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు. 
 
వీరికి సమయానికి మందులు, భోజనం అందించే సిబ్బందిని మంగళవారం తెల్లవారుజామున డీఎస్పీ అదుపులోకి తీసుకున్నారు. దీంతో తన తల్లి, మేనత్తల బాగోగులు చూసుకునేందుకు దివాకర్ రెడ్డి తనయుడు పవన్ కుమార్ రెడ్డి గురువారం తాడిపత్రికి రాగా.. పోలీసులు ఆయనపై సైతం ఆంక్షలు విధించారు. 'మీరు తాడిపత్రిలో ఉండకూడదు. ఉంటే గృహ నిర్బంధం చేస్తాం' అని పోలీసులు హెచ్చరించారు. తనపై ఆంక్షలు విధించడం సరికాదని పవన్ వాదించినప్పటికీ.. పోలీసులు వినిపించుకోలేదు. చేసేదిలేక కుటుంబ సభ్యులను పవన్ హైదరాబాద్ నగరానికి తీసుకెళ్లారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments