Webdunia - Bharat's app for daily news and videos

Install App

అటెన్ష‌న్లో పోలీసులు, గుండెపోటుతో సీఐ శ్రీధ‌ర్ రెడ్డి మృతి

Webdunia
బుధవారం, 28 జులై 2021 (13:15 IST)
విధి నిర్వ‌హ‌ణ‌లో అనేక ఒడిదుడుకులు, నిత్యం బిజీ, కేసుల‌తో టెన్ష‌న్... వెర‌సి పోలీసుల‌కు దిన‌దిన గండంగా మారుతోంది. పోలీసు శాఖ‌లో ముఖ్యంగా ఎస్.ఐ, సి.ఐ. కేడ‌ర్లో వారిపై ఒత్తిళ్ళు అధిక‌మ‌వుతున్నాయి. ప్ర‌తి కేసును స్టేష‌న్ హౌస్ ఆఫీస‌ర్‌గా సి.ఐ. క్యాడ‌ర్ వారే చూడాల్సి రావ‌డంతో టెన్ష‌న్ అధికం అవుతోంది.
 
నేటి బుధ‌వారం ఉద‌యం సీఐ శ్రీధర్ రెడ్డి మృతి చెందారు.  ఏపీ సిఐడి హెడ్ క్వార్టర్స్‌లో సీఐగా  పనిచేస్తున్న శ్రీధర్ రెడ్డి ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో శ్రీధ‌ర్ రెడ్డి కుప్పకూలారు. వెంటనే అక్కడ ఉన్నవారు హాస్పిటల్‌కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

సీఐ శ్రీధర్ రెడ్డి మృతి పట్ల పోలీసు ఉన్నతాధికారులు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. గుండెపోటుతో ఆయ‌న మ‌ర‌ణించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. విధి నిర్వ‌హ‌ణ‌లో పోలీసు అధికారుల‌కు తీవ్ర టెన్ష‌న్ ఎదుర‌వుతోంద‌ని, ఇది చాలా బాధాక‌ర‌మ‌ని పేర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments