Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఐకు బెదిరింపులు - మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు

ఠాగూర్
మంగళవారం, 7 జనవరి 2025 (10:37 IST)
నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, వైకాపా నేత కాకాణి గోవర్థన్ రెడ్డిపై వేదాయపాళెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. సీఐను బెదిరించిన కేసులో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటాచలం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెల 27వ తేదీన పోలీసులు ఈ కేసు నమోదు చేయగా, ఇది తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
కాగా, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కాకాణి ముఖ్య అనుచరుడు, వెంకటాచలం మాజీ జడ్పీటీసీ సభ్యుడు మండల వెంకట శేషయ్య తనను లైంగికంగా వేధించారంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా, ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. 
 
దీనిపై మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తాము అధికారంలోకి వస్తే సీఐ పచ్చ చొక్క ధరించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చుట్టూ తిరగాల్సి ఉంటుందంటూ బహిరంగ హెచ్చరికలు చేశారు. దీంతో పోలీసులను బెదిరించారని, కేసు విచారణ సక్రమంగా సాగకుండా నిర్వీర్యం చేయాలని చూశారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రాజెక్టుపై చర్చల కోసం పిలిచి దుస్తులు విప్పేయమన్నారు : హీరోయిన్ ఆరోపణలు

సినిమాలో సిగరెట్లు కాల్చాను.. నిజ జీవితంలో ఎవరూ పొగతాగకండి : హీరో సూర్య వినతి

అమెరికా నుంచి కన్నప్ప భారీ ప్రమోషన్స్ కు సిద్ధమయిన విష్ణు మంచు

థగ్ లైఫ్ ఫస్ట్ సింగిల్‌ తెలుగులో జింగుచా.. వివాహ గీతం రేపు రాబోతుంది

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం