Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామాలయంలో క్రైస్తవ భజనలు: అసత్య ప్రచారం నమ్మొద్దు

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (17:48 IST)
తూర్పు గోదావరి జిల్లాలో చోటు చేసుకున్న ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రామచంద్రాపురం సమీపంలోని పామర్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని కె.గంగవరం గ్రామంలోని రామాలయంలో క్రైస్తవ మతానికి సంబంధించిన ప్రార్థనలు జరిగినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. 
 
దీనిపై జిల్లా వ్యాప్తంగా దుమారం రేగడంతో విషయం పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై విచారణ జరిపిన జిల్లా ఎస్పీ రవీంథ్రనాథ్ బాబు క్లారిటీ ఇచ్చారు. గంగవరం గ్రామంలో కాదా మంగాయమ్మ అనే మహిళ గత కొన్ని సంవత్సరాల నుంచి తన ఇంటి ముందు ఉన్న రోడ్డు మీద ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు.
 
అదే రోడ్డుకి ఆనుకుని ఉన్న రామాలయంలో నిత్యం పూజలు జరుగుతుంటాయని ఈ విషయంలో స్థానిక హిందువులకు, క్రిస్టియన్లకు కలసిమెలసి ఉంటున్నారని, ఎటువంటి వివాదాలు లేవని స్పష్టం చేశారు. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. దీనిపై గ్రామంలో విచారణ జరిపిన పోలీసులు అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రజలు అసత్య ప్రచారం నమ్మొద్దని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments