Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిగ్గు సిగ్గు.. మహిళా కానిస్టేబుల్ కోసం రోడ్డుపైనే కొట్టుకున్న ఖాకీలు

Webdunia
శనివారం, 30 జులై 2022 (21:53 IST)
ఓ మహిళా కానిస్టేబుల్ కోసం ఒక సీఐ, మరో కానిస్టేబుల్ బహిరంగంగా కొట్టుకోవడం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన పోలీసులే మహిళ కోసం నడిరోడ్డుపై కొట్టుకోవడం అందరూ వేలెత్తి చూపేలా చేసింది.
 
భీమవరం వన్ టౌన్ పోలీస్టేషన్లో ఓ లేడీ కానిస్టేబుల్‌ని రాజేశ్ అనే కానిస్టేబుల్ బైక్ పై లిఫ్ట్ ఇస్తుండటాన్ని సీఐ కృష్ణ భగవాన్ చూసి తట్టుకోలేకపోయాడు. దీనితో ఈ విషయమై కానిస్టేబుల్‌ని ప్రశ్నించి.. అజమాయిషీ చేసే తరుణంలో పర్సనల్ అనే మాట రావడంతో ఆ విషయం కాస్త చినికి చినికి గాలివానగా మారింది. 
 
ఆపై ఒకరిపై ఒకరు దాడిచేసుకునే వరకు వచ్చింది. జిల్లాలో పోలీసుశాఖ పరువుని తీసిన ఈ ఘటన ఉన్నతాధికారులకు కోపాన్ని తెప్పించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా.. విచారణ చేసిన ఉన్నతాధికారులు సీఐ తప్పుకి పనిష్మెంట్ ఇస్తూ వీఆర్‌కు పంపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments