Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

ఠాగూర్
ఆదివారం, 17 నవంబరు 2024 (15:06 IST)
వైకాపా నేత, గుంటూరు మేయర్ మనోహర్ నాయుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక అరండల్ పేట పోలీసుకు టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లపై పరుష, అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ శ్రీనివాస రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
గత వైకాపా ప్రభుత్వం అక్రమ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసింది. ఆ సమయంలో టీడీపీ, జనసేన శ్రేణులు అరండల్ పేట ప్రాంతంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. అపుడు మనోహర్ నాయుడు అక్కడకు చేరుకుని వీరంగం సృష్టించారు. పోలీసుల వద్ద నుంచి లాఠీ మరీ తీసుకుని టీడీపీ - జనసేన శ్రేణులపట్ల దురుసుగా ప్రవర్తించాడు. అలాగే, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను దూషించారు. 
 
దీనిపై అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా కనపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదు చేయడంతో మనోహర్ నాయుడుతో పాటు పలువురు వైకాపా నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments