Webdunia - Bharat's app for daily news and videos

Install App

దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం : మాధురిపై పోలీసుల కేసు.. ఎందుకో తెలుసా?

ఠాగూర్
సోమవారం, 12 ఆగస్టు 2024 (16:39 IST)
వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో ఆయన అడల్టెరీ రిలేషన్‌షిప్ కొనసాగిస్తున్న దివ్వెల మాధురిపై టెక్కలి పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా కారు నడిపి రోడ్డు ప్రమాదానికి కారణమయ్యారని పేర్కొంటూ ఆమెపై భారత న్యాయ సంహిత సెక్షన్ 125 ప్రకారం అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. 
 
కాగా, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో మాధురి కలిసి ఉంటోందని, తన భర్తను తనకు కాకుండా చేసిందని దువ్వాడ వాణి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై వాణి తన కూతురు హైందవితో కలిసి టెక్కలిలోని దువ్వాడ ఇంటి ముందు నిరసన చేస్తున్నారు. 
 
ఇంట్లోకి అనుమతించాలని గత నాలుగు రోజులుగా రాత్రీపగలు అక్కడే ఉంటున్నారు. ఈ గొడవకు సంబంధించి మీడియా ముఖంగా వాణి, మాధురి పరస్పరం తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్నారు. దీంతో టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ నివాసంపై తనకూ హక్కు ఉందని, ఇకపై పిల్లలతో కలిసి అక్కడే ఉంటానని మాధురి ఆదివారం ప్రకటించారు.
 
సాయంత్రం తన కారులో టెక్కలికి బయలుదేరారు. ఈ క్రమంలోనే పలాస హైవేపై లక్ష్మీపురం టోల్ గేట్ దగ్గర మాధురి నడుపుతున్న కారు ప్రమాదానికి గురైంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. కానీ, కారు మాత్రం దెబ్బతినగా మాధురికి మాత్రం రవ్వంత కూడా గాయం కాలేదు. అయినప్పటికీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుంది. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, ఇది రోడ్డు ప్రమాదం కాదని, వాణి ఆరోపణలతో డిప్రెషన్‌‌కు గురై తానే ఆ కారును ఢీ కొట్టానని మాధురి చెప్పారు. జరుగుతున్న పరిణామాలతో విసుగుచెంది చనిపోవాలనే ఉద్దేశంతో యాక్సిడెంట్ చేశానన్నారు. అయితే, పోలీసులు మాత్రం కారును నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదానికి కారణమయ్యారంటూ కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments