Webdunia - Bharat's app for daily news and videos

Install App

గన్నవరం టీడీపీ ఇన్‌చార్జ్ యార్లగడ్డ వెంకట్రావుపై కేసు

Webdunia
శుక్రవారం, 25 ఆగస్టు 2023 (17:29 IST)
టీడీపీ గన్నవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా తాజాగా నియమితులైన యార్లగడ్డ వెంకట్రావుపై కృష్ణా జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కృష్ణాలో చేపట్టిన యువగళం పాదయాత్ర సందర్భంగా రంగన్నగూడెం వద్ద ఉద్రిక్తలు నెలకొన్నాయి. అధికార వైకాపా, ప్రతిపక్ష టీడీపీ శ్రేణుల మధ్య బాహాబాహీగా తలపడ్డారు. 
 
ఒక దశలో పోలీస్ స్టేషన్ ఆవరణలోనే పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేసునేంత స్థాయికి వెళ్లాయి. అయితే, ఈ ఘర్షణలకు సంబంధించి పోలీసులు టీడీపీ నేతలపైనే కేసులు నమోదు చేశారు. హత్యాయత్నం, ఎస్సీఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇందులో 50 మందిపైగా టీడీపీ కార్యకర్తలు నిందితులుగా ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో ఇటీవల వైకాపాకు రాజీనామా చేసి టీడీపీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావును ఈ కేసులో ఏ1 నిందితుడిగా పేర్కొన్నారు. అమెరికాలో ఉన్న ఆళ్ల గోపాలకృష్ణారెడ్డి అనే వ్యక్తిని కూడా ఈ కేసులో నిందితుడిగా పేర్కొనడం గమనార్హం. అలాగే, ఆ పార్టీ సీనియర్ నేతలు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణలపై కూడా రంగన్నగూడెం ఘర్షణలకు సంబంధించి కేసు నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments