Webdunia - Bharat's app for daily news and videos

Install App

గన్నవరం టీడీపీ ఇన్‌చార్జ్ యార్లగడ్డ వెంకట్రావుపై కేసు

Webdunia
శుక్రవారం, 25 ఆగస్టు 2023 (17:29 IST)
టీడీపీ గన్నవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా తాజాగా నియమితులైన యార్లగడ్డ వెంకట్రావుపై కృష్ణా జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కృష్ణాలో చేపట్టిన యువగళం పాదయాత్ర సందర్భంగా రంగన్నగూడెం వద్ద ఉద్రిక్తలు నెలకొన్నాయి. అధికార వైకాపా, ప్రతిపక్ష టీడీపీ శ్రేణుల మధ్య బాహాబాహీగా తలపడ్డారు. 
 
ఒక దశలో పోలీస్ స్టేషన్ ఆవరణలోనే పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేసునేంత స్థాయికి వెళ్లాయి. అయితే, ఈ ఘర్షణలకు సంబంధించి పోలీసులు టీడీపీ నేతలపైనే కేసులు నమోదు చేశారు. హత్యాయత్నం, ఎస్సీఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇందులో 50 మందిపైగా టీడీపీ కార్యకర్తలు నిందితులుగా ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో ఇటీవల వైకాపాకు రాజీనామా చేసి టీడీపీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావును ఈ కేసులో ఏ1 నిందితుడిగా పేర్కొన్నారు. అమెరికాలో ఉన్న ఆళ్ల గోపాలకృష్ణారెడ్డి అనే వ్యక్తిని కూడా ఈ కేసులో నిందితుడిగా పేర్కొనడం గమనార్హం. అలాగే, ఆ పార్టీ సీనియర్ నేతలు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణలపై కూడా రంగన్నగూడెం ఘర్షణలకు సంబంధించి కేసు నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments