Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిన్నెల్లికి జూన్ 6వ తేదీతో ముగియనున్న గడువు!! ఇంటి వద్ద పోలీసుల పహారా (Video)

వరుణ్
గురువారం, 6 జూన్ 2024 (09:37 IST)
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత  పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయకుండా ఏపీ హైకోర్టు కల్పించిన మధ్యంతర ఉత్తర్వుల గడువు గురువారం రాత్రితో ముగియనుంది. మే నెల 13వ తేదీన జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలోకి పిన్నెల్లి ప్రవేశించి ఈవీఎంను ధ్వంసం చేసిన వషయం తెల్సిందే. అలాగే, మాచర్లలో జరిగిన పలు దాడుల కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు. 
 
అయితే, ఈ నెల ఆరో తేదీ వరకు ఆయనను అరెస్టు చేయొద్దంటూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఇపుడు ఈ గడువు తీరిపోనుంది. మరోవైపు, బందోబస్తుతో వైకాపా నేతను బుధవారం జిల్లా పోలీసు కార్యాలయానికి తీసుకొచ్చిన పోలీసులు రిజిస్టర్‌లో సంతకం చేయించారు. నరసరావుపేట పట్టణ శివారు రావిపాడు రెవెన్యూ పరిధిలో ఆయన బస చేసిన ప్రైవేటు విల్లా (గృహం) వద్ద భద్రత మరింతగా పెంచారు. తప్పించుకుని వెళ్లిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులు పహారా కాస్తున్న పోలీసు సిబ్బందికి సూచించారు. శుక్రవారం పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments