Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులతో గోవిందనామస్మరణలతో మారుమ్రోగిన అలిపిరి

Webdunia
గురువారం, 11 జూన్ 2020 (17:59 IST)
తిరుమల శ్రీవారి దర్సనార్థం సామాన్య భక్తులను ఈరోజు నుంచి అనుమతించింది టిటిడి. టోకెన్లు పొందిన భక్తులను అలిపిరి పాదాల నుంచి సప్తగిరి తనిఖీ కేంద్రం నుంచి తిరుమలకు అనుమతించారు. 80 రోజులుగా బోసిపోయిన కనిపించిన అలిపిరి సామాన్య భక్తులతో కళకళలాడింది.
 
గోవింద నామస్మరణలతో భక్తులు తిరుమలకు పయనమై వెళ్ళారు. నిన్న ఆఫ్‌లైన్లో 3వేల టోకెన్లను అందించింది టిటిడి. అయితే భక్తులు అధికసంఖ్యలో క్యూలైన్లలో నిలబడి ఉండటంతో 14వ తేదీ వరకు టోకెన్లను అందించారు. టోకెన్లు ఉన్న వారిని మాత్రమే అలిపిరి పాదాల మండపం తిరుమలకు అనుమతించారు.
 
అలాగే అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద కూడా టోకెన్లను చూసిన తరువాత భక్తులను సొంత వాహనాల్లోను, ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు అనుమతించారు. భక్తులు లేక వెలవెలబోయిన తిరుమల, తిరుపతి ప్రస్తుతం భక్తులతో కళకళలాడుతోంది. చాలారోజుల తర్వాత భక్తులను చూసిన స్థానికులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
 
టిటిడి చేసిన ఏర్పాట్లపై కూడా భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. అలిపిరి వద్ద వాహనాలకు శానిటైజేషన్ చేయడం.. భక్తులు చేతులను శుభ్రం చేసుకున్న తరువాతనే పంపిస్తున్నారు. అలాగే ఖచ్చితంగా మాస్క్‌లు ధరించాలని సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments