Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్-5 జోన్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన అమరావతి రైతులు

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2023 (14:43 IST)
అమరావతి ప్రాంతంలో ఆర్-5 జోన్ వ్యవహారంపై అమరావతి ప్రాంత రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి చంద్రసూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ఈ నెల 14వ తేదీన విచారణకు రానుంది. ఈ పిటిషన్‌ను సీనియర్ న్యాయవాది శేషాద్రి నాయుడు దాఖలు చేశారు. 
 
వాస్తవానికి ఈ నెల 10న విచారణకు తీసుకోవాలని రైతుల తరపున న్యాయవాది కోరగా.. ఆరోజు కేసుల జాబితా ఇప్పటికే తయారైందని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తెలిపారు. అందుకే ఈ పిటిషన్‌ను 14వ తేదీన విచారణకు తీసుకుంటామని చెప్పారు. అమరావతి రైతులు ఆర్‌-5 జోన్‌పై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 
 
అయితే ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా రాజధాని అమరావతిలోని 900 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలుగా బృహత్‌ ప్రణాళిక (మాస్టర్‌ ప్లాన్‌)లో మార్పులు చేస్తూ ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments