Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధురాలి మృతదేహానికి పింఛన్, వేలిముద్రలు: వార్డు వాలంటీర్ అందుకే ఇచ్చాడట..

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (20:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వార్డు వాలంటీర్లు అర్హులైనవారి ఇళ్లకు వెళ్లి ప్రతి నెలా మొదటి తేదీన ఇస్తుంటారు. ఐతే ఈరోజు విజయనగరం జిల్లాలోని గుర్ల గ్రామానికి చెందిన త్రినాథ్ అనే వాలంటీరు, అదే గ్రామానికి చెందిన ఎర్రనారాయణ అనే వృద్ధురాలికి పెన్షన్ ఇవ్వాలని వెళ్లాడు.
 
ఐతే ఆమె అనారోగ్యంతో మరణించడంతో ఆమె మృతదేహాన్ని ఇంటిముందు పెట్టారు. వాలంటీర్ త్రినాథ్ పరిస్థితిని చూశాడు. ఇచ్చేందుకు పింఛన్ తీసుకువస్తే వృద్ధురాలు మరణించిందని ఆవేదన వ్యక్తం చేస్తూ పెన్షన్ డబ్బును ఆమె కుటుంబ సభ్యులకు అందించాడు.
 
పింఛన్ తీసుకున్న వ్యక్తి వేలిముద్రలు కావాల్సి వుండటంతో మృతురాలి వేలి ముద్రలు తీసుకుని వచ్చేసాడు. ఐతే వాలంటీర్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చనిపోయినవారికి పెన్షన్ ఎలా ఇస్తారంటూ కొందరు ప్రశ్నిస్తుంటే... ఆ సమయంలో మానవత్వంతో ఆలోచించి ఆ పని చేసాడని మరికొందరు అంటున్నారు. అధికారులు మాత్రం ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments