Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి ఆలయంపై దుష్ప్రచారాలు నమ్మకండి, పెద్దజియ్యర్ స్వామి

Webdunia
సోమవారం, 30 మార్చి 2020 (23:11 IST)
తిరుమల శ్రీవారి ఆలయంలో అఖండ దీపం ఆగిపోయింది.. సరిగ్గా నైవేద్యాలు పెట్టడం లేదు. ఆలయంలో ఎన్నో రకాల అపచారాలు జరుగుతున్నాయని రకరకాల ప్రచారాలు కొంతమంది చేస్తున్నారు. కొంతమంది స్వార్థపరులు కావాలనే పనిగట్టుకుని ఈ దుష్ప్రచారం చేస్తున్నారు. కోట్లాదిమంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి ఎవరూ ఆందోళనకు గురికావద్దు.
 
ఆలయంలో ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి వరకు ఏకాంత సేవలన్నీ సరిగ్గానే నిర్వహిస్తున్నాము. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేవు. అఖండ దీపాన్ని కూడా చిన్నదిగా చేశాము కానీ.. దీపం 24 గంటల పాటు వెలుగుతోంది. కైంకర్యాలన్నీ సక్రమంగా కొనసాగుతున్నాయి అంటూ తిరుమల పెద్దజియ్యంగార్ స్పష్టం చేశారు. 
 
స్వయంగా పెద్దజియ్యంగార్ టిటిడి ఈఓకు ఒక లేఖ కూడా రాశారు. ఆలయంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించాలని..ప్రజా సంబంధాల అధికారి ద్వారా మీడియా ప్రకటన చేయాలని కూడా నిన్ననే పెద్దజియ్యంగార్ కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న హడావిడిగా పిఆర్ ఓ విభాగం మీడియాకు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. మీడియా ముందు ఎప్పుడూ రాని పెద్దజియ్యంగార్ ఈరోజు మధ్యాహ్నం తిరుపతిలో మీడియా ముందుకు వచ్చి తిరుమలపై  జరుగుతున్న దుష్ప్రచారాన్ని పూర్తిగా ఖండించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments