Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన నాయకుడి కారుపై ఎమ్మెల్యే జోగి అనుచరుల దాడి

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (10:30 IST)
ఇటీవల తెలుగుదేశం అధినేత ఇంటిపైకి వెళ్లి, వివాదాస్ప‌దం అయిన పెడ‌న ఎమ్మెల్యే జోగి ర‌మేష్ ఇపుడు మ‌రో వివాదాంలో చిక్కుకున్నారు. ఆయ‌న అనుచ‌రులు త‌న‌పై దాడి చేశార‌ని జ‌న‌సేన నాయ‌కుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. 
 
పెడన నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త యడ్లపల్లి రామ్ సుధీర్ కారును ఈ తెల్ల‌వారుజామున గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు ధ్వంసం చేశారు. త‌న‌పై దాడి చేయడానికి వ‌చ్చిన వారే కారును ధ్వంసం చేశార‌ని ఆ నాయ‌కుడు పేర్కొంటున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పెడన రైల్వే గేట్ సమీపంలోని హైఫై హోటల్ వద్ద ఈ దాడికి పాల్ప‌డ్డారు. 
 
పెడన పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న ఆ హోటల్ లో రామ్ సుధీర్ బస చేస్తుండగా, బయట అగి ఉన్న కారు అద్దాలను రాళ్లతో పగలకొట్టారు. ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎమ్మెల్యే జోగి ర‌మేష్ అనుచ‌రుల‌ని జ‌న‌సేన నాయ‌కుడు ఆరోపిస్తున్నారు. జోగి రమేష్ అనుచరులు తనపై దాడి చేశారు అంటూ పోలీసులకు రామ్ సుధీర్ ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas and Anushka: ప్రభాస్‌తో కలిసి నటిస్తాను అంటోన్న దేవసేన (video)

Krish: పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే.. - ఇప్పుడు సినిమా లైఫ్ మూడు గంటలే : క్రిష్ జాగర్లమూడి

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అంకిత్ కొయ్య, నీలఖి ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ తిరిగే బ్యూటీ గా లవ్ సాంగ్‌

Rehman: ఏఆర్ రహ్మాన్ బాణీలతో రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments