Webdunia - Bharat's app for daily news and videos

Install App

లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు.. ఫైర్ అయిన పవన్ కల్యాణ్

సెల్వి
శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (11:25 IST)
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడటంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం తన ట్విట్టర్ హ్యాండిల్‌ ద్వారా స్పందించారు. అటువంటి పవిత్ర నైవేద్యంలో జంతువుల కొవ్వును ఉపయోగించడం అసంఖ్యాక భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని పవన్ పేర్కొన్నారు. 
 
సనాతన ధర్మ పరిరక్షణకు అంకితమైన జాతీయ బోర్డును ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను పవన్ కళ్యాణ్ నొక్కిచెప్పారు. దేవాలయాల పరిరక్షణ, హిందూ విశ్వాసం గురించి దేశవ్యాప్తంగా చర్చలు జరపాలని పిలుపునిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఇందుకు బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
 
వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉందని, ఈ విషయంలో సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ ప్రకటించారు. 
 
మరోవైపు తిరుమల లడ్డూ ప్రసాదాలపై వచ్చిన ఆరోపణలకు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఆరోపణలు చేసిన వ్యక్తి చెప్పింది అబద్దమైతే వారు తప్పకుండా వేంకటేశ్వరస్వామి ఆగ్రహానికి గురవుతారని మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments