Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఎన్నికల్లో జనసేన విజయం.. పవన్ సిఎం... ఎవరు?

రానున్న ఎన్నికలపై సర్వత్రా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ ఇప్పటికే ప్రజా సమస్యలపై ముందుకెళుతూ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటిం

Webdunia
బుధవారం, 4 జులై 2018 (14:29 IST)
రానున్న ఎన్నికలపై సర్వత్రా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ ఇప్పటికే ప్రజా సమస్యలపై ముందుకెళుతూ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు‌. దీంతో ఎపిలో త్రిముఖ పోటీ తప్పనిసరి అని అందరూ భావించారు. అనుకున్న విధంగానే పవన్ కళ్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో తన ప్రభావం చూపుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభావం ఉంటుంది. మొదటి స్థానంలో జనసేన, రెండవ స్థానంలో వైసిపి, మూడవ స్థానంలో టిడిపి ఉండిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయే అవకాశం లేకపోలేదని, పవన్ కళ్యాణ్‌ సిఎం అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు. ఇదిలావుంటే ఉత్తరాంధ్ర పర్యటనలో వున్న పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో తనకు రాష్ట్రాన్ని ఐదేళ్లపాటు పాలించే అధికారం ఇవ్వాలంటూ ప్రజలను కోరుతున్నారు. మరి ఏపీ ప్రజలు అధికారం ఇస్తారో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments