Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉండవల్లిలో పవన్.. కట్టలు తెంచుకున్న అభిమానం...!

Webdunia
గురువారం, 5 మార్చి 2015 (10:58 IST)
జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఆయన ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని, అక్కడ నుంచి  తాడేపల్లి మండలం ఉండవల్లికి చేరుకున్నారు. 
 
అక్కడ తమ పవర్ స్టార్‌ను దగ్గరి నుంచీ చూడాలన్న అభిమానుల అత్యుత్సాహం సభను గందరగోళ పరిచింది. మైకులు సరిగ్గా పనిచేయక పోవడంతో, పవన్ ఏమి మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. వేదిక దగ్గరకు దూసుకెళ్లిన అభిమానులు, మీడియా ప్రతినిధుల మధ్య కొంత తోపులాట జరిగింది. పోలీసుల సంఖ్య తక్కువగా ఉండటంతో వీరిని అదుపు చేయడం సమస్యగా మారింది. 
 
దీంతో అతిగా అల్లరి చేస్తున్న అభిమానులపై పవన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాగే అల్లరి చేయాలనుకుంటే వెనక్కి వెళ్ళిపోవాలని ఆయన అన్నారు. ప్రజలు కన్నీళ్లు పెడితే కొత్త రాజధానికి మంచిది కాదని వ్యాఖ్యానించిన ఆయన, ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారాయణ, పత్తిపాటిలతో తానూ రైతుల తరపున మాట్లాడతానని చెప్పారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments