Webdunia - Bharat's app for daily news and videos

Install App

23న ఉమ్మడి పగో జిల్లాలో జనసేనాని పర్యటన

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (07:29 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా పేరుతో ఓ యాత్రను కొనసాగిస్తున్నారు. ఇందులోభాగంగా, ఆయన ఇప్పటికే అనంతపురం జిల్లాలో పర్యటించి పలువురు కౌలు రైతు కుటుంబాలకు తన వ్యక్తిగత నిధులతో ఆర్థిక సాయం చేశారు. ఇపుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 23వ తేదీన ఆయన ఈ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. 
 
ఈ యాత్రలో భాగంగా, ఆయన 23వ తేదీ ఉదయం 9 గంటలకు ఏలూరు బైపాస్ మీదుగా చింతలపూడికి వెళతారు. అక్కడ ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతు కుటుంబాలను కలిసి జనసేన పార్టీ తరపున రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. 
 
ఆపై చింతలపూడిలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆత్మహత్యలకు పాల్పడిన మరికొందరు రైతులకు ఆయన లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చెక్కులను అందజేస్తారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments