Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని నిర్మాణానికి పవన్ సహకారం కోరిన చంద్రబాబు..!

Webdunia
ఆదివారం, 1 మార్చి 2015 (15:12 IST)
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ను ఆంధ్ర రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సహకరించాలని ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. పవన్ కళ్యాణ్ ఆదివారం రోజు చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. భూసమీకరణలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఉదారంగానే అందించామని చెప్పారు. బడ్జెట్ కేటాయింపులలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు.
 
ఆదివారం ఉదయం చంద్రబాబు నివాసంలో ఆయనను పవన్ కల్యాణ్ కలిసిన సంగతి తెలిసిందే. భేటీలో భాగంగా రాజధాని నిర్మాణం కోసం సేకరిస్తున్న భూములు, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగింది. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, రాజధాని నిర్మాణానికి సహకారం అందించాలని పవన్ కల్యాణ్‌ను కోరినట్లు చెప్పారు. 
 
ప్రభుత్వం తమ నుంచి బలవంతంగా భూములను లాక్కుంటోందని జనసేన కార్యకర్తలు ఇటీవల ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి పవన్, చంద్రబాబుల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. భూ సమీకరణతో పాటు కేంద్రం ప్రవేశపెట్టిన రైల్వే, సాధారణ బడ్జెట్లు, తాజా రాజకీయ పరిణామాలపైనా వారిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments