Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ ట్వీట్ : కొండగట్టు ఆంజనేయ స్వామి సాక్షిగా యాత్ర

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుంచి తన రాజకీయ యాత్రను ప్రారంభించనున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.

Webdunia
ఆదివారం, 21 జనవరి 2018 (10:37 IST)
కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుంచి తన రాజకీయ యాత్రను ప్రారంభించనున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. తన రాజకీయ పర్యటన ప్రణాళికను అక్కడే ప్రకటిస్తానని శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. తమ కుటుంబానికి కొండగట్టు ఆంజనేయస్వామి ఇలవేల్పుగా చెప్పారు. అందుకే కొండగట్టు నుంచి తన నిరంతర రాజకీయ యాత్రను ప్రారంభించడానికి కారణమన్నారు. 
 
2009లో ఎన్నికల ప్రచార సమయంలో పెను ప్రమాదం నుంచి తాను ఇక్కడే క్షేమంగా బయటపడ్డానని గుర్తు చేసుకున్నారు. సర్వమత ప్రార్థనల అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశీస్సుల కోసం, సమస్యల అధ్యయనం, అవగాహన కోసం ఈ యాత్రతో వస్తున్నట్లు తెలిపారు. తనను తెలుగు ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. అయితే కొండగట్టుకు ఎప్పుడు వెళ్లేది పవన్ ప్రకటించలేదు. 

 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments