Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేనాన్ని జనవాణి కార్యక్రమం - విజయవాడ నుంచి ప్రారంభం

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (11:53 IST)
సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వ పాలన పనితీరును ఎండగట్టేలా ఆయన నిరంతరం ప్రజల్లో ఉండేలా జనవాణి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే నెల మూడో తేదీ నుంచి విజయవాడ నగరంలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ఈ  కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. 
 
ప్రజా సమస్యలు ప్రభుత్వానికి తెలిసేలా ఈ జనవాణి కార్యక్రమాన్ని రూపకల్పన చేసినట్టు ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా, బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పవన్ స్వయంగా ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తారని తెలిపారు. 
 
ఆ అర్జీలను సంబంధిత అధికారులకు ఆయన పంపించనున్నారు. ఆ తర్వాత ఆ అర్జీలపై జనసేన కార్యాలయం నుంచి అధికారులను సంప్రదిస్తూ ఆరా తీస్తుంటారు. ఇకనుంచి ప్రతి ఆదివారం ఈ జనవాణి కార్యక్రమం ఉంటుందని, తొలి రెండు కార్యక్రమాలు మాత్రం విజయవాడలోనే జరుగుతాయని నాదెండ్ల మనోహర్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments