డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్ - తెలుగు రాష్ట్రాల్లో ఓజీ ఫీవర్ ప్రారంభం

సెల్వి
బుధవారం, 24 సెప్టెంబరు 2025 (11:28 IST)
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత రెండు రోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. అయినా తన అధికారిక విధులను నిర్వర్తిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ, కళ్యాణ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. సోమవారం జరిగిన కీలకమైన సమీక్ష సమావేశాలలో పాల్గొన్నారు. 
 
వైద్యులు డిప్యూటీ సీఎంకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆయన కోలుకోవడానికి విశ్రాంతి తీసుకోవాలని సిఫార్సు చేశారు. ఇక పవన్ కల్యాణ్ కార్యాలయం నుండి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన వెలువడింది. 
 
ఈ నేపథ్యంలో ఆయన శీఘ్రంగా కోలుకోవాలని జనసైనికులు, పవన్ మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
 
ఇకపోతే.. తెలుగు రాష్ట్రాల్లో ఓజీ ఫీవర్ ప్రారంభమైంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా గురువారం (సెప్టెంబర్ 25) నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఇందుకోసం బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్ షోలు పడనున్నాయి. 
 
సాహో డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించిన ఓజీ సినిమాలో పవన్ కల్యాణ్ తో పాటు పలువురు స్టార్స్ నటిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక కాగా, బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments