Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pawan Kalyan Warning: అధికారులకు వార్నింగ్ ఇచ్చిన పవన్.. ఆంధ్రా ప్రజలు భలే! (video)

సెల్వి
గురువారం, 12 డిశెంబరు 2024 (07:50 IST)
Pawan Kalyan Warning: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. కలెక్టర్ల సదస్సులో మాట్లాడిన పవన్ కల్యాణ్... కాకినాడ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లి మూడు చెక్ పోస్టులు పెట్టినా కూడా అక్రమ రవాణా జరుగుతుందంటే ఎవరిని నిందించాలో అర్థం కావట్లేదన్నారు.
 
గత ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ పాత్ర లేదని పవన్ కల్యాణ్ ఆరోపించారు. కేవలం వారు చెప్పింది వినడమే కానీ తప్పులు జరుగుతున్నాయి అని తెలిసినా వద్దు అని చెప్పలేని పరిస్థితి అన్నారు. తప్పులు జరుగుతున్నా వద్దని చెప్పకపోవడం వల్ల నేడు రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయిందన్నారు. జనసేన పార్టీ ఆఫీసు దగ్గరకొచ్చి జనం సమస్యలు చెప్తుంటే డబ్బులు లేవు, జీతాలు ఇవ్వలేకపోయామని అధికారులు చెబుతున్నారు. 
 
ఇటీవల సత్యసాయి జిల్లాలోని వాటర్ సప్లై ఉద్యోగులకు నెలలు తరబడి జీతాలు ఇవ్వలేదంటే అప్పటికప్పుడు సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని 30 కోట్ల రూపాయలు వారి జీతాలకు విడుదల చేశారన్నారు. 
 
తప్పు మన పాలనలో ఉన్నా.. ప్రజల ముందు అడగటానికి వెనకాడని పాలకులను ఆంధ్రా ప్రజలు ఎన్నుకున్నారు. దీంతో వారు మన దేశానికే ఆదర్శంగా నిలవబోతున్నారని పవన్ కొనియాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments