Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో వైకాపా అలజడిపై 'హోం'కు ఫిర్యాదు చేస్తా : పవన్ కళ్యాణ్

Webdunia
ఆదివారం, 15 మార్చి 2020 (12:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా నేతలు సృష్టించిన అల్లర్లు, అలజడి, హింసాంత్మక సంఘటనలు, భౌతిక దాడులు, బెదిరింపులపై కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు కేంద్రం హోం మంత్రికి ఫిర్యాదు చేస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అలాగే, 'స్థానిక ఎన్నికలను ఎలాగో వాయిదా వేశారు కాబట్టి.. నామినేషన్ల ప్రక్రియ కూడా మళ్లీ జరపాలి' అని ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఆదివారం స్పందించారు. ఏపీలో ఎన్నికల ప్రక్రియను మళ్లీ కొత్తగా చేపట్టాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. భయానక వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ జరిగిందన్నారు. భయపెట్టి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేశారని వ్యాఖ్యానించారు.
 
"రాష్ట్రంలో జరిగిన ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తా. వైసీపీ నేతల దాడులకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు అమిత్ షాకు  అందజేస్తాం. జనసేన మహిళా నేతలపై దాడుల చేస్తే వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నామినేషన్ల ప్రక్రియలో హింసాత్మక ఘటనలు జరిగాయి. 13 జిల్లాలో వైసీపీ దౌర్జన్యానికి పాల్పడింది. ఎన్నికల అధికారులపై కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తా. కేంద్రానికి లేఖలు రాయడమే కాకుండా స్వయంగా నేను వెళ్లి కేంద్ర పెద్దలను కలుస్తా'' అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 
 
అంతేకాకుండా, 'ఏయే అధికారి ఏయే తప్పులు చేశారన్న విషయాలను కూడా బయట పెడతాం. వైసీపీ అధికారంలో ఉందని, సులువుగా తప్పించుకోవచ్చని భావించి ఇటువంటి చర్యలకు పాల్పడితే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గుర్తు పెట్టుకోండి మిమ్మల్ని ఎవరూ వదిలిపెట్టరు' అని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments