Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాంచీ ప్రమాద ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందన.. ఏమన్నారంటే...

గోదావరిలో లాంచీ మునిగిన సంఘటనలో గల్లంతైన వారి కోసం మొత్తం 20కి పైగా పడవలతో ముమ్మరంగా గాలిస్తున్నారు. దేవీపట్నం మండలం మంటూరు వద్ద ప్రయాణికులతో వస్తున్న లాంచీ మునిగి దాదాపు 45 మంది వరకు గల్లంతయ్యారు.

Webdunia
బుధవారం, 16 మే 2018 (10:57 IST)
గోదావరిలో లాంచీ మునిగిన సంఘటనలో గల్లంతైన వారి కోసం మొత్తం 20కి పైగా పడవలతో ముమ్మరంగా గాలిస్తున్నారు. దేవీపట్నం మండలం మంటూరు వద్ద ప్రయాణికులతో వస్తున్న లాంచీ మునిగి దాదాపు 45 మంది వరకు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
 
అలాగే భారీ క్రేన్ల సాయంతో లాంచీని బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేగాక నేవీ, ఎన్డీఆర్ఎప్ బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటూ విస్తృతంగా గాలిస్తున్నాయి. ఇదిలావుంటే లాంచీ మునిగిన ఘటనలో గల్లంతైన వారి కోసం 20 పడవలతో గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు.
 
ఇదిలావుండగా, తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన లాంచీ ప్రమాద ఘటనపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ స్పందించారు. లాంచీ ప్రమాద ఘటన చాలా బాధాకరమన్నారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని కార్యకర్తలకు పవన్ పిలుపునిచ్చారు. బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా నిలవాలని పవన్‌ కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

దుబాయిలో వైభవ్ జ్యువెలర్స్ ప్రెజెంట్స్ Keinfra Properties గామా అవార్డ్స్

నేచురల్ స్టార్ నాని చిత్రం ది ప్యారడైజ్ కోసం హాలీవుడ్ కొలాబరేషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments