Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ-సేవా కాంట్రాక్ట్ ఉద్యోగులను ఆదుకోండి.. పవన్ విజ్ఞప్తి

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (19:57 IST)
పదిహేనేళ్ల నుంచి ఈ-సేవలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు చేస్తున్నవారు ఒక్కసారి రోడ్డునపడటం చాలా బాధకరమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. ఈ-సేవా ఉద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలని పవన్ డిమాండ్ చేశారు. కరోనా విపత్తు మూలంగా లాక్‌డౌన్ విధించిన క్రమంలో ఆ ఉద్యోగులకు గత 5 నెలలుగా జీతాలు కూడా చెల్లించడం లేదన్నారు. 
 
రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ ఈ-సేవ కేంద్రాల్లో వివిధ ఉద్యోగాల్లో 607 మంది ఉన్నారు. వీరంతా నెలల తరబడి జీతాలు రాకపోవడం మూలంగా కష్టనష్టాల్లోఉన్నారు. కుటుంబాలు పోషణకు ధీమా... ఉపాధికి హామీ లేక ఆవేదనలో ఉన్నారని పవన్ చెప్పారు. ఈ-సేవ కేంద్రాల ద్వారా సేవా రుసుముల రూపేణా రూ.వేల కోట్ల ఆదాయం కూడా ప్రభుత్వానికి సమకూరుతోంది. 
 
ఈ కేంద్రాలకు సంబంధించిన విధుల్లో ఉన్న ఉద్యోగులను ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్ సర్వీసెస్ (ఆప్కాస్) పరిధిలోకి తీసుకొని వారి ఉపాధికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆ ఉద్యోగుల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని పవన్ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments