Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిత్రుని కోసమే భీమ్లా నాయక్ ప్రిరిలీజ్ ఈవెంట్ రద్దు : పవన్ కళ్యాణ్

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (17:42 IST)
గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి తనకు మంచి మిత్రుడని, ఆయన మృతికి సంతాప  సూచకంగానే తాను నటించిన భీమ్లా నాయక్ చిత్రం ప్రిరిలీజ్ వేడుకను వాయిదా వేసినట్టు జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. 
 
సోమవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందిన ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి మేకపాటి గౌతం రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఆయన ఆత్మకు నివాళులర్పించారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని గౌతం రెడ్డి నివాసానికి వెళ్లిన పవన్‌ కల్యాణ్‌ ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. 
 
ఈ సందర్బంగా నెల్లూరులో మేకపాటి కుటుంబ సభ్యులతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పరిశ్రమల శాఖ మంత్రిగా గౌతం రెడ్డి చేస్తున్న కృషిని పవన్ కళ్యాణ్ కొనియాడారు. రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన ఆయన.. వ్యాపారంలో వచ్చిన సొమ్మును ప్రజాసేవకే వెచ్చించారన్నారు. ఆయన మృతికి సంతాపం తెలిపేందుకే తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వాయిదా వేసుకున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments