మిత్రుని కోసమే భీమ్లా నాయక్ ప్రిరిలీజ్ ఈవెంట్ రద్దు : పవన్ కళ్యాణ్

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (17:42 IST)
గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి తనకు మంచి మిత్రుడని, ఆయన మృతికి సంతాప  సూచకంగానే తాను నటించిన భీమ్లా నాయక్ చిత్రం ప్రిరిలీజ్ వేడుకను వాయిదా వేసినట్టు జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. 
 
సోమవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందిన ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి మేకపాటి గౌతం రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఆయన ఆత్మకు నివాళులర్పించారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని గౌతం రెడ్డి నివాసానికి వెళ్లిన పవన్‌ కల్యాణ్‌ ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. 
 
ఈ సందర్బంగా నెల్లూరులో మేకపాటి కుటుంబ సభ్యులతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పరిశ్రమల శాఖ మంత్రిగా గౌతం రెడ్డి చేస్తున్న కృషిని పవన్ కళ్యాణ్ కొనియాడారు. రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన ఆయన.. వ్యాపారంలో వచ్చిన సొమ్మును ప్రజాసేవకే వెచ్చించారన్నారు. ఆయన మృతికి సంతాపం తెలిపేందుకే తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వాయిదా వేసుకున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Avika Gor : అవిక గోర్ నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ

Samantha: ది గాళ్ ఫ్రెండ్ చిత్రానికి సమంత ను కాదని రష్మిక ను ఎందుకు తీసుకున్నారో తెలుసా...

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments