Webdunia - Bharat's app for daily news and videos

Install App

కౌగిలించుకునేందుకు కాంగ్రెస్ నేతలను ఆహ్వానించలేదు : పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఏర్పాటు చేసిన సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ(జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ) తొలి సమావేశం హైదరాబాద్‌లోని దస్పల్లా హోటల్‌లో శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఈ సమావేశం పవన్ అధ్యక్షతన

Webdunia
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (12:50 IST)
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఏర్పాటు చేసిన సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ(జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ) తొలి సమావేశం హైదరాబాద్‌లోని దస్పల్లా హోటల్‌లో శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఈ సమావేశం పవన్ అధ్యక్షతన రెండు రోజుల పాటు జరుగనుంది. ఇందులో కేంద్ర ప్రబుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులు, రాష్ట్రం ఖర్చు చేసిన నిధులు, విభజన హామీలు తదితర అంశాలపై జేఎఫ్‌సీలోని నేతలు, మేధావులు, న్యాయనిపుణులతో చర్చిస్తారు. అయితే, సమావేశానికి కాంగ్రెస్ నేతలను ఆహ్వానించడం ఇపుడు వివాదాస్పదంగా మారింది. దీనిపై పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. 
 
జేఎఫ్‌సీ సమావేశానికి కాంగ్రెస్ నేతల అభిప్రాయం తెలుసుకునేందుకే పిలిచామే తప్ప వారిని కౌగిలించుకోవడం లేదన్నారు. అలాగే సమావేశానికి టీడీపీ, వైసీపీ వారిని కూడా పిలిచామని, కానీ వారు మాత్రం వారి పంథాలో ముందుకు వెళుతున్నారని చెప్పారు. ఏది ఏమైనా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. రెండు రోజుల సమావేశం అనంతరం తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments