కౌగిలించుకునేందుకు కాంగ్రెస్ నేతలను ఆహ్వానించలేదు : పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఏర్పాటు చేసిన సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ(జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ) తొలి సమావేశం హైదరాబాద్‌లోని దస్పల్లా హోటల్‌లో శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఈ సమావేశం పవన్ అధ్యక్షతన

Webdunia
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (12:50 IST)
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఏర్పాటు చేసిన సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ(జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ) తొలి సమావేశం హైదరాబాద్‌లోని దస్పల్లా హోటల్‌లో శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఈ సమావేశం పవన్ అధ్యక్షతన రెండు రోజుల పాటు జరుగనుంది. ఇందులో కేంద్ర ప్రబుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులు, రాష్ట్రం ఖర్చు చేసిన నిధులు, విభజన హామీలు తదితర అంశాలపై జేఎఫ్‌సీలోని నేతలు, మేధావులు, న్యాయనిపుణులతో చర్చిస్తారు. అయితే, సమావేశానికి కాంగ్రెస్ నేతలను ఆహ్వానించడం ఇపుడు వివాదాస్పదంగా మారింది. దీనిపై పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. 
 
జేఎఫ్‌సీ సమావేశానికి కాంగ్రెస్ నేతల అభిప్రాయం తెలుసుకునేందుకే పిలిచామే తప్ప వారిని కౌగిలించుకోవడం లేదన్నారు. అలాగే సమావేశానికి టీడీపీ, వైసీపీ వారిని కూడా పిలిచామని, కానీ వారు మాత్రం వారి పంథాలో ముందుకు వెళుతున్నారని చెప్పారు. ఏది ఏమైనా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. రెండు రోజుల సమావేశం అనంతరం తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments