గుంటూరు జిల్లా ప్రాంతాలు ఉండవల్లి, ఎర్రజెర్ల, బేతంపూడి, తుళ్లూరు గ్రామ రైతులతో ముఖాముఖి పాల్గొని అక్కడి ప్రాంతాలలో పర్యటించేందుకు జనసేన చీఫ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం నాడు రానున్నారు. రాజధాని భూసేకరణ వ్యవహారంలో రైతులు ఆందోళన చేపట్టిన నేపధ్యంలో పవన్ పర్యటించనున్నారు.
పవన్ కళ్యాణ్ రేపు హైదరాబాదులో ఉదయం 8.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి వస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా గుంటూరు జిల్లా ఉండవల్లి చేరుకుని అక్కడి రైతులతో మాట్లాడుతారు. అనంతరం మిగిలిన ప్రాంతాలలోనూ పర్యటిస్తారు. తమకు న్యాయం చేయాలంటూ గతవారం రాజధాని ప్రాంత రైతులు ఆందోళన చేస్తూ జనసేన పార్టీ బ్యానర్లను పట్టుకుని పవన్ కళ్యాణ్ తమను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.