Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో పర్యటించనున్న పవన్ కల్యాణ్.. డీసీఐకు మద్దతు

కేంద్ర ప్రభుత్వ రంగ ''డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా"(డీసీఐ) ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ‌ప‌ట్నంలోని డీసీఐ ఉద్యోగులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే.

Webdunia
మంగళవారం, 5 డిశెంబరు 2017 (18:03 IST)
కేంద్ర ప్రభుత్వ రంగ ''డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా"(డీసీఐ) ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ‌ప‌ట్నంలోని డీసీఐ ఉద్యోగులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోవడంతో డీసీఐ ఉద్యోగి వెంకటేష్ విజయనగరం జిల్లా నెర్లిమర్లలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. దీంతో ఆందోళన ఉద్ధృతం కావడంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డీసీఐ ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలిపారు. బుధవారం నుంచి జరుగనున్న సమ్మెలో పవన్ పాల్గొంటారని తెలిసింది. 
 
వెంక‌టేష్ ఆత్మ‌హ‌త్య‌తో ఆందోళన తీవ్రతరమవుతున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో బుధవారం పవన్ విశాఖకు వెళ్లనున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా వెంకటేష్ కుటుంబాన్ని పవన్ పరామర్శిస్తారని.. ఆందోళ‌న‌కు పవన్ మద్దతు తెలుపుతారని సమాచారం. కాగా, ప‌వ‌న్ క‌ల్యాణ్ విశాఖ‌ప‌ట్నంతో పాటు విజ‌య‌న‌గ‌రంలోనూ మొత్తం మూడు రోజుల పాటు ప‌ర్య‌టిస్తారు. ఈ సంద‌ర్భంగా త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తోనూ స‌మావేశం అవుతారని జనసేన పార్టీ వర్గాల సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments