Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్లిద్దరి బాటలో పవన్ కళ్యాణ్... ఏపీ సీఎం పీఠం ఎక్కేస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రజల్లో ఆసక్తి వున్నదో లేదోనన్న సర్వేను ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయిస్తున్నట్లు భోగట్టా. ప్రత్యేక హోదా విషయంలో 50 శాతానికి ఒక్క శాతం ఎక్కువున్నా జ

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (21:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రజల్లో ఆసక్తి వున్నదో లేదోనన్న సర్వేను ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయిస్తున్నట్లు భోగట్టా. ప్రత్యేక హోదా విషయంలో 50 శాతానికి ఒక్క శాతం ఎక్కువున్నా జనసేన అధినేత ఎట్టి పరిస్థితుల్లో హోదాపై రాజీ పడే ప్రసక్తే ఉండదని చెప్పుకుంటున్నారు. ఒకవేళ ప్రజలు ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీతోనే సరే అని అనుకుంటున్నట్లయితే ప్యాకేజీ ద్వారా వారికి వనగూరే ప్రయోజనాల ఏమిటన్నది తెలుసుకునేందుకు కసరత్తు కూడా చేస్తున్నారట. 
 
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమస్యల సుడిగుండంలో పడి కొట్టుకుపోతున్న కొన్ని ప్రాంతాలను పవన్ కళ్యాణ్ ఇప్పటికే లిస్టవుట్ చేశారట. ఆ లిస్టును ఖరారు చేసిన తర్వాత సినిమాల్లో నటించడం మానేసి ఎర్ర కండువాతో పాదయాత్ర మొదలుపెడతారనే మాటలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల నాటికి ఏపీలో వున్న ప్రజలందరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడి తీరాల్సిందేనని పవర్ స్టార్ గట్టిగా అనుకుంటున్నట్లు సమాచారం. అదే జరిగితే గతంలో వైఎస్, బాబు పాదయాత్రలు చేసి సీఎం పీఠాన్ని దక్కించుకున్నట్లు పవన్ కూడా దక్కించుకుంటారేమోననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments