Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థత... ఎన్నికల ప్రచారానికి విరామం!!

ఠాగూర్
సోమవారం, 1 ఏప్రియల్ 2024 (09:47 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. అయినప్పటికీ ఆయన శనివారం ప్రచారం కొనసాగించారు. ఆదివారం కూడా తాను పోటీ చేసే పిఠాపురం నియోజకవర్గంలో వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. షెడ్యూల్ ముద్రస్తుగా ఖరారు కావడంతో అనారోగ్యంతోనే ప్రచారం కొనసాగించారు. అయితే, ఆయనకు జ్వరం, దగ్గులు సోమవారానికి ఎక్కువైంది. 
 
పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్న పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరీ షెడ్యూల్ ముందస్తుగానే ఖరారైంది. దీంతో ప్రచారం వాయిదా వేయడం ఇష్టం లేక ఆయన ప్రచారానికి హాజరయ్యారు. ఆరోగ్యం సహకరించకున్నప్పటికీ వైద్యం పొందుతూనే శనివారం ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. 
 
ఆదివారం శక్తిపీఠాన్ని సందర్శించుకున్న అనంతరం జనసేన - టీడీపీ - బీజేపీ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు శ్రేణులకు పలు సూచనలు చేశారు. అత్యవసర సమావేశం కోసం ఆదివారం సాయంత్రం హెలికాఫ్టర్‌లో హైదరాబాద్ వెళ్లిన పవన్ కళ్యాణ్, సోమవారం ఉదయం మళ్ళీ పిఠాపురం చేరుకుని మిగిలిన పర్యటన పూర్తి చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments