Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామోజీరావు గారి పార్థివ దేహానికి నివాళులర్పించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్

ఐవీఆర్
శనివారం, 8 జూన్ 2024 (20:24 IST)
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి పార్థివ దేహానికి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. రామోజీ రావు గారి కుటుంబ సభ్యులు శ్రీ కిరణ్, శ్రీమతి శైలజా కిరణ్, శ్రీమతి విజయేశ్వరిలను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ప్రమాణ స్వీకారోత్సవం జరిగిన తర్వాత ఆయనను వచ్చి కలుసుకుందామని అనుకున్నట్లు చెప్పారు.
 
ఐతే ఇంతలోనే ఈ విషాదం జరిగిందని అన్నారు. ఆయనను క్షోభకు గురి చేసిన ప్రభుత్వాలు ఇప్పుడు అధికారంలో లేవని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నానని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు పవన్ కల్యాణ్. పవన్ వెంట శ్రీ రామోజీ రావు గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన వారిలో ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్, నిర్మాత శ్రీ సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments