Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆరూ.. నోరు పారేసుకోవద్దు: పవన్ కళ్యాణ్ హితవు

Webdunia
శుక్రవారం, 22 ఆగస్టు 2014 (11:04 IST)
ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కేసీఆర్‌కు క్లాజ్ తీసుకున్నారు. ఇష్టానికి నోరు పారేసుకోవద్దని సూచించారు. జనసేన పార్టీ బలోపెతానికై పూర్తి స్థాయిలో కసరత్తు ఇంకా ప్రారంభించలేదని గురువారం అన్నారు. 
 
సర్వేలో పాల్గొనడానికి పవన్ నిరాకరించినట్టుగా వస్తున్న వార్తలపై పవన్ స్పందిస్తూ ఆ రోజు తాను నగరంలో లేనని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పవన్‌పై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కేసీఆర్ ఇకనైనా ద్వేషం రెచ్చగొట్టేలా మాట్లాడకూడదని నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని మంచి పాలకుడిగా ఉండమని సూచించారు.
 
తెలంగాణ-ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రుల భేటీపై స్పందిస్తూ పదవీ ప్రమాణాలు చేపట్టిన వెంటనే వీరిరువురూ ఇరు రాష్ట్రాల సమస్యలపై చర్చించుకుని ఉంటే రెండు నెలల క్రితమే ఎన్నో సమస్యలు పరిష్కారమయ్యేవని అభిప్రాయపడ్డారు.
 
కాగా గురువారం రాత్రి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య పలు విషయాలు చర్చకు వచ్చాయని తెలుస్తోంది. అయితే, ఈ విషయాలని తగిన సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తానని పవన్ కళ్యాణ్ మీడియాతో అన్నారు. 
 
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి స్టార్ కంపైనర్‌గా వ్యవహరించిన పవన్ తాజాగా అమిత్ షాతో భేటీ అవడం పలు చర్చలకు దారి తీస్తోంది. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments