Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీతో పొత్తు గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు : సోము వీర్రాజు

Webdunia
బుధవారం, 15 మార్చి 2023 (15:26 IST)
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే విషయంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా మాట్లాడలేదని, అందువల్ల ఈ విషయం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. మంగళవారం రాత్రి జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీతో ఉంటే జనసేనకు ముస్లింలు దూరవుతారని కొందరు అంటున్నారని, ముస్లింలకు ఇష్టంలేకపోతే బీజేపీకి తాను దూరమవుతానని చెప్పారు. ఒకవేళ బీజేపీతో పొత్తులో ఉన్నపుడు వారిపై ఎక్కడైనా దాడి జరిగితే పొత్తు నుంచి బయటకు వస్తానని తెలిపారు.
 
ఈ వ్యాఖ్యాలపై సోము వీర్రాజు స్పందిస్తూ, టీడీపీతో జనసేన పొత్తు గురించి పవన్ కళ్యాణ్ ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తుపై పవన్ క్లారిటీ ఇచ్చిన తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడుతానని చెప్పారు. నాలుగేళ్ల పాలనలో ఉత్తరాంధ్రకు జగన్ చేసిందేమీ లేదని వీర్రాజు అన్నారు. విశాఖ రాజధాని అని చెబుతూ ఉత్తరాంధ్ర ప్రజలను సీఎం జగన్ మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులతో ఉత్తరాంధ్ర అభివృద్ధి చేసిందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments