Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాజధాని రైతులు గగ్గోలు... చంద్రబాబును పవన్ కడిగేశారా...?!!

Webdunia
మంగళవారం, 3 మార్చి 2015 (14:15 IST)
ఏపీ రాజధాని రైతులు తమ భూములను లాక్కుంటున్నారంటూ చేస్తున్న ఆందోళనపై పవన్ కళ్యాణ్ మొన్నటి భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును నిలదీసినట్లు సమాచారం. అంతేకాకుండా రాజధాని కోసం కావాల్సిన భూములు కంటే ఎక్కువ తీసుకున్నారంటూ ప్రతిపక్షాలు బాబును విమర్శిస్తున్న నేపధ్యంలో పవన్ కూడా దీనిపై మాట్లాడినట్లు తెలుస్తోంది. 
 
మొన్నటి ఎన్నికల్లో తనకు వెన్నుదన్నుగా నిలిచిన పవన్ ఇలా ప్రశ్నాస్త్రాలు సంధించడంపై చంద్రబాబు కక్కలేక మింగలేక ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు కేంద్రం నుంచి అందాల్సిన నిధుల విషయంలోనూ జాప్యం జరగడంపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. 
 
ఈ నేపధ్యంలో మార్చి 5 తర్వాత ఏపీ రాజధాని ప్రాంత రైతులతో సమావేశమయ్యాక పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారనే దానిపై ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments