Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని లేకుండా రాష్ట్రమిచ్చారు.. ఆంధ్రుల ఆవేదన ఏంటో చెప్తా: పవన్

జనసేన ఆవిర్భావోత్సవ సభ గుంటూరులోని నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా జరుగుతోంది. జనసేన పార్టీ ఆవిర్భవించి నేటికి (బుధవారం) నాలుగు సంవత్సరాలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జనసేన ఆవిర్భావ మహాసభకు భారీస్థాయి

Webdunia
బుధవారం, 14 మార్చి 2018 (18:53 IST)
జనసేన ఆవిర్భావోత్సవ సభ గుంటూరులోని నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా జరుగుతోంది. జనసేన పార్టీ ఆవిర్భవించి నేటికి (బుధవారం) నాలుగు సంవత్సరాలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జనసేన ఆవిర్భావ మహాసభకు భారీస్థాయిలో అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కార్యకర్తలు, అభిమానులను, ప్రజలను ఉద్దేశించి ప్రసంగం మొదలెట్టారు. 
 
భారత్ మాతాకీ జై అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. సమకాలీన రాజకీయ వ్యవస్థ ప్రజలను వంచించినందుకే జనసేన పార్టీ ఆవిర్భవించిందని పవన్ తెలిపారు. ప్రజల మనిషిగా ప్రజల ముందుకు వచ్చి తాను పార్టీని పెట్టానని.. కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రుల ఆవేదన ఏంటో ఈ సభ ద్వారా తెలియజేద్దామని తెలిపారు. ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుతున్నారు.  
 
ప్రజలకు అండగా వుండేందుకు జనసేన పుట్టుకొచ్చిందని పవన్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అంటే.. మనవారికి భయం, పిరికితనం. దోపిడి చేసేవారికే పిరికితనం వుంటుంది. అలాంటప్పుడు మనమెందుకు కేంద్ర ప్రభుత్వాన్ని చూసి భయపడాలి అంటూ పవన్ ప్రశ్నించారు. రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విభజించారు. ప్రస్తుతం 25మంది ఎంపీలను చేతిలో పెట్టుకుని.. 5 కోట్ల ప్రజలను నియంత్రించాలని కేంద్రం భావిస్తుందని పవన్ నిప్పులు చెరిగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments