Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్షమించండి.. అప్పుడు విదేశాల్లో ఉన్నా.. రాలేకపోయా: పవన్

కృష్ణా జిల్లా పడవ ప్రమాద మృతుల కుటుంబాలను జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా పడవ ప్రమాద మృతుల కుటుంబాలను ఒ

Webdunia
శనివారం, 9 డిశెంబరు 2017 (14:49 IST)
కృష్ణా జిల్లా పడవ ప్రమాద మృతుల కుటుంబాలను జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా పడవ ప్రమాద మృతుల కుటుంబాలను ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఆయన పరామర్శించారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఈ ప్రమాదం జరిగిన సమయంలో తాను విదేశాల్లో ఉన్నానని.. అందుకే రాలేకపోయానని.. క్షమించాలని బాధిత కుటుంబాలతో అన్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే పడవ ప్రమాదం జరిగిందన్నారు. విహార యాత్రకు వెళ్తే విషాదం మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ప్రమాద బాధితుల బాధను అందరూ అర్థం చేసుకోవాలని.. ఎవరినీ నిందించేందుకు తాను రాలేదని పవన్ అన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు కాస్త ఊరట నిచ్చేందుకే తాను ఇక్కడి వచ్చానని చెప్పుకొచ్చారు.

పడవ ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదని, వారికి ప్రభుత్వం అండగా ఉండాలని తెలిపారు. ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. నష్టపరిహారం ఇచ్చేస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అంటూ పవన్ కల్యాణ్ నిలదీశారు.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments