Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ జనసేన గుర్తు ‘పిడికిలి’!!: ఆగస్టు 15న ప్రకటన?

Webdunia
శనివారం, 26 జులై 2014 (18:07 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ ఆగస్ట్ 15న తన పార్టీ ఎన్నికల గుర్తును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా వస్తున్న విమర్శలకు పుల్ స్టాప్ పెట్టేందుకు స్వాతంత్ర్యం దినోత్సవాన జనసేన ఎన్నికల గుర్తును ప్రకటించాలని పవన్ టీం భావిస్తోంది. పార్టీ గుర్తుగా 'పిడికిలి ని'ఎన్నుకున్నట్లు జనసేన పార్టీ వర్గాల సమాచారం. 
 
జనసేన పార్టీని సంస్థాగతంగా పటిష్టపరిచేందుకు కూడా పవన్ కల్యాణ్ కసరత్తు ప్రారంభించారు. ఓ వైపు గోపాల గోపాల షూటింగ్‌లో పాల్గొంటూనే... మరోవైపు జిల్లాల వారీగా తాత్యాలిక కమిటీలు ఏర్పాటుకు పవన్ తన అనుచరులతో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా జనసేనను విస్తరించాలని పవన్ భావిస్తున్నట్టు సమాచారం.
 
గోపాల గోపాల షూటింగులో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. గబ్బర్ సింగ్ - 2 సినిమా ప్రారంభం కావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ మెదక్ జిల్లా మాసాయిపేట రైలు ప్రమాదం ఘటనపై స్పందించారు. ప్రమాద స్థలిని సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు. ఓ వైపు షూటింగులు చేస్తూనే అవసరమైనప్పుడు బయటకు రావాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు సమాచారం.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments