Webdunia - Bharat's app for daily news and videos

Install App

హృదయంలో కుళ్లు కుతంత్రాలు ఉంటే ఎముకలు కుళ్లుపోతాయ్... పవన్ వరుస ట్వీట్లు

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2022 (19:39 IST)
రాష్ట్ర పర్యటన కోసం తాను సిద్ధం చేసుకున్న వారాహి వాహనం రంగును లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించిన వైకాపా నేతలకు జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తనదైనశైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ధీటుగానే సమాధానం చెబుతున్నారు. భరించలేని అసూయతో వైకాపా నేతలు రగిలిపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నానాటికీ  వైకాపా కుళ్లిపోతుందని పవన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 
 
"ఈర్ష్యతో బాధపడే విద్యార్థులు ఇతరుల వస్తువులను నాశనం చేసినపుడు మా స్కూలులో ఒక ఉపాధ్యాయుడు ఓ సూక్తిని పదేపదే చెప్పేవారు. హృదయంలో శాంతి ఉంటే ఆ దేహానికి ఆయుష్షు పెరుగుతుంది. కానీ, హృదయంలో కుళ్లు కుతంత్రాలు ఉంటే వారి ఎముకలు కుళ్ళిపోతాయి అని చెప్పేవారు" అంటూ పవన్ పేర్కొన్నారు. 
 
ఇదే వరుసలో పవన్ ఒనిడా టీవీ వాణిజ్య ప్రకటనను కూడా ప్రస్తావించారు. పొరుగువాడికి కడుపుమంట, యజమానికి గర్వకారణం అంటూ సాగే యాడ్ పిక్‌ను షేర్ చేశారు. ఈ యాడ్ నాకు చాలా ఇష్టం అని చెప్పారు. 
 
మరో ట్వీట్‌లో ఆలివ్ గ్రీన్ రంగులో ఉన్న ఓ కారు, బైక్ ఫోటోలను షేర్ చేసిన పవన్.. నియమనిబంధనలు కేవలం పవన్ కళ్యాణ్‌ కోసమే అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఇంకా పచ్చని చెట్లతో కూడిన ఓ గార్డెన్ ఫోటోలను పోస్టు చేసిన పవన్.. ఇందులో మీకు ఏ రకం పచ్చదనం నచ్చింది వైసీపీ? అంటూ వెటకారం ప్రదర్శించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments