Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నబాబు - ద్వారంపూడితో నరకం అనే పదానికి స్పెల్లింగ్ రాయిస్తా : పవన్ కళ్యాణ్

వరుణ్
ఆదివారం, 28 ఏప్రియల్ 2024 (09:55 IST)
వచ్చే ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ - జనసేన - బీజేపీ పార్టీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వైకాపా ఎమ్మెల్యేలు కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌లతో నరకం అనే పదానికి స్పెల్లింగ్ రాయిస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. కాకినాడ వారాహి వియభేరీ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కురసాల కన్నబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ప్రజల కోసం బతకాలి అనే ఒక స్ఫూర్తి తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందన్నారు. కానీ, తమ వద్ద డొక్కు స్కూటర్‌పై తిరిగే కన్నబాబు ఇవాళ్ల పెద్ద నాయకుడు అయిపోయాడని మండిపడ్డారు. వెయ్యి కోట్ల రూపాయలకు ఆస్తి పరుడు అయ్యాడని చెప్పారు. తాను మాత్రం ఆశయం కోసం నిలబడి దశాబ్దకాలంగా నలిగిపోయానని చెప్పారు. 
 
ప్రతి ఒక్క వెధవతో మాటలు అనిపించుకున్నాని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. తన అన్న చిరంజీవి వల్లే కురసాల కన్నబాబు రాజకీయ నేత అయ్యాడని గుర్తు చేశాడు. చిరంజీవి పడేసిన భిక్షతో ఇవాల వైకాపా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడంటూ మండిపడ్డారు. నాడు చిరంజీవిని అవమానించారని, వాస్తవానికి అది నిర్మాతలకు సంబంధించిన విషయం అని అయినా చిరంజీవి ముందుకు వచ్చారని చెప్పారు. "నాడు చిరంజీవి, మహేశ్ బాబును ప్రభాస్‌ను జగన్ అహంకారంతో పిలిపించారు. వారిని కూర్చోబెట్టి మీరు నన్ను బతిమాలండి అని చెప్పి దాన్ని వీడియో తీశారు. ఆ వీడియోను బయటకు రిలీజ్ చేశారు. కన్నబాబును ఒక్కటే అడుగుతున్నా... సిగ్గుందా కన్నబాబు నీకు.. ఏం బతుకు నీది... ఆ నీచుడు చిరంజీవిని అవమానిస్తుంటే సిగ్గుగా అనిపించలేదా నీకు చిరంజీవి పెట్టిన రాజకీయ భిక్ష వల్లే కదా నువ్వు రాజకీయ నేత  అయింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments