Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీటెక్‌ విద్యార్థిని తేజస్విని ఆత్మహత్య: పవన్ కల్యాణ్ మండిపాటు

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (22:05 IST)
గుంటూరు జిల్లాలో బీటెక్‌ విద్యార్థిని తేజస్విని వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే ఆత్మహత్య చేసుకుందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాల యాజమాన్యాలు పరీక్షలు రాయనివ్వడం లేదని అన్నారు. ప్రభుత్వ విధానం కారణంగా పేద విద్యార్థులు వారి తల్లిదండ్రులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారని వెంటనే ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మరణించిన తేజస్వీ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
 
ఒంగోలులో ఓ విద్యార్థిని బలవన్మరణం చెందిందన్న వార్తపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విచారం వ్యక్తం చేశారు. ఒంగోలులో బీటెక్ చదువుతున్న తేజస్విని అనే విద్యార్థిని కాలేజీ ఫీజులు చెల్లించలేక ఆత్మహత్య చేసుకుందన్న వార్త తన మనసును కలచివేసిందని తెలిపారు. ఇది అత్యంత దురదృష్టకరమైన విషయం అని తెలిపారు. 
 
తల్లిదండ్రులకు చదివించే స్తోమత లేదన్నప్పుడు ప్రభుత్వం ఏంచేస్తోందని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ఏమైందని చంద్రబాబు నిలదీశారు. నాడు నేడు అంటూ పనికిమాలిన కబుర్లు చెబుతూ విద్యావ్యవస్థను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments