Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ వంటి వ్యక్తులను ప్రధాని ఖచ్చితంగా శిక్షిస్తారు : పవన్ కళ్యాణ్

వరుణ్
సోమవారం, 29 ఏప్రియల్ 2024 (09:21 IST)
అవినీతిపరుడైన జగన్మోహన్ రెడ్డి వ్యక్తులను ప్రధాని నరేంద్ర మోడీ ఖచ్చితంగా శిక్షిస్తారని జనసేన పార్టీ అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వారాహి విజయభేరీ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ, జగన్ తన కేసుల గురించి మాఫీ చేసుకునేందుకు ప్రధాని మోడీ వద్దకు వెళ్లేవారన్నారు. మోడీ అలాంటి వ్యక్తులకు గౌరవం ఇవ్వరన్నారు. ముఖ్యంగా, అనేక అవినీతి కేసులు ఉన్న జగన్.. ప్రధాని నరేంద్ర మోడీ వద్ద గట్టిగా మాట్లాడగలరా అని ప్రశ్నించారు. కానీ, తాను మాత్రం మాట్లాడగలనని చెప్పారు. 
 
తనకు లంచాల సొమ్ము, అవినీతి సొమ్ము అవసరం లేదని తాను ఒక సినిమా చేస్తే కోట్లు వస్తాయని అన్నారు. యువతకు మెరుగైన భవిష్యత్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. కూటమి అధికారంలోకి వస్తే యువత జీవితాలు బాగుపడతాయని చెప్పారు. 14 యేళ్లుగా ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు, మూడున్నరేళ్లుగా సీఎంగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మన కూటమిలో ఉన్నారన్నారు. దశాబ్దకాలంగా పోరాడుతూనే తాను ఉన్నానని, మాకు అండగా నిలబడండి.. రాష్ట్రం కోసం పని చేసే బాధ్యత తీసుకుంటాం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Tej: పేరెంట్స్‌తో విషయాలు పంచుకునేలా పిల్లలుండాలి - సాయి దుర్గ తేజ్

విశ్వప్రసాద్, డైరెక్టర్ కార్తీక్ రెండు పిల్లర్ లా మిరాయ్ రూపొందించారు : తేజ సజ్జా

Kantara 1: రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 కోసం సాంగ్ రికార్డ్ చేసిన దిల్‌జిత్

Komati reddy: సినెటేరియా ఫిలిం ఫెస్టివల్ వెబ్ సైట్ ప్రారంభించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Manoj: నన్నే కాదు నా కుటుంబాన్ని నిలబెట్టి ఆయనే : మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

Mustard oil: ఆవనూనెతో ఆరోగ్యం మాత్రమే కాదు.. అందం కూడా..?

Coconut Milk: జుట్టు ఆరోగ్యానికి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

తర్వాతి కథనం
Show comments