Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌వ‌న్ దీక్ష‌కు సంఘీభావంగా అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్ష‌లు...

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నంత ప‌ని చేసారు. అవ‌స‌ర‌మైతే దీక్ష చేస్తా అని చాలా సంద‌ర్భాల్లో చెప్పారు. ఆఖ‌రికి అన్నట్టుగానే దీక్ష చేస్తున్నారు. శ్రీకాకుళంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ రేపు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజల మధ్య దీక్షను కొనసాగించనున్నారు.

Webdunia
శుక్రవారం, 25 మే 2018 (21:07 IST)
ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నంత ప‌ని చేసారు. అవ‌స‌ర‌మైతే దీక్ష చేస్తా అని చాలా సంద‌ర్భాల్లో చెప్పారు. ఆఖ‌రికి అన్నట్టుగానే దీక్ష చేస్తున్నారు. శ్రీకాకుళంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ రేపు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజల మధ్య దీక్షను కొనసాగించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడం లేదు కాబట్టే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ దీక్ష చేపడుతున్నారని ఆ పార్టీ అడ్వైజరీ కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం హైదరాబాద్‌లో మీడియాకు తెలిపారు.
 
ఉద్ధానం కిడ్నీ బాధితులకి సర్కార్ నుంచి మెరుగైన వైద్య సేవలు అందేవరకు జనసేన పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. ఎలాంటి రాజకీయ ప్రయోజనాలూ ఆశించకుండా మానవతా దృక్పథంతో పవన్ కళ్యాణ్‌ ఈ సమస్యకి పరిష్కారం తీసుకురావాలని సంకల్పించుకున్నారని మాదాసు గంగాధరం తెలిపారు. పవన్‌ దీక్షకు సంఘీభావంగా అన్ని జిల్లా కేంద్రాలు, విజయవాడ నగరంలో జనసేన శ్రేణులు సంఘీభావ దీక్ష చేస్తాయన్నారు. మ‌రి... ఈ దీక్షపై తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments