Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్లను చూసి నేర్చుకోండి.. ఎంపీలు ఏం చేస్తున్నారు: పవన్

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తమిళ ప్రజలను చూసి నేర్చుకోండని హితవు పలికారు. తమిళనాడు రాష్ట్ర ప్రజల వెనుక అక్కడి నేతలు నిలబడుతున్నారని.. మన రాష్ట్రంలో నేతలు మాత్రం అదే తరహా సమస్య పరిష్కారానికి ఎందుకు మ

Webdunia
మంగళవారం, 19 డిశెంబరు 2017 (09:47 IST)
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తమిళ ప్రజలను చూసి నేర్చుకోండని హితవు పలికారు. తమిళనాడు రాష్ట్ర ప్రజల వెనుక అక్కడి నేతలు నిలబడుతున్నారని.. మన రాష్ట్రంలో నేతలు మాత్రం అదే తరహా సమస్య పరిష్కారానికి ఎందుకు ముందడుగు వేయట్లేదని పవన్ అన్నారు. ఏపీ ఎంపీలంతా కలిసి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరణ యత్నాలను అడ్డుకునే దిశగా ఢిల్లీకి వెళ్లి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలవాలని కోరారు. ఎంపీలంతా మోదీకి వినతి పత్రాన్ని సమర్పించాలని కోరారు. 
 
మన ఎంపీలు తమిళనాడును ఆదర్శంగా తీసుకోవాలని, నష్టాల్లో ఉన్నప్పటికీ, సేలం స్టీల్ ప్లాంటును ప్రైవేటు సంస్థలకు అప్పగించకుండా ఆ రాష్ట్ర సర్కారు అడ్డుకుంటున్న విషయాన్ని పవన్ గుర్తు చేశారు. ఏపీ నేతలను ఎవరు ఆపుతున్నారో అర్థం కావడం లేదని పవన్ ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు. ఇప్పటికే రాష్ట్ర విభజన తరువాత అన్యాయం జరిగిందని, ప్రత్యేక హోదా వంటి రాజ్యాంగ పరమైన హామీలను సైతం నెరవేర్చలేదని పవన్ గుర్తు చేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments