నేను ఎన్టీఆర్‌లా అమాయకుణ్ని కాదు... వెన్నుపోటు పొడిపించుకునేందుకు...

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడుపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు ఘాటైన విమర్శలు చేశారు. తాను వెన్నుపోటు పొడిపించుకునేందుకు ఎన్టీఆర్‌లా అమాయకుడుని కాదంటూ స్పష్టం

Webdunia
మంగళవారం, 14 ఆగస్టు 2018 (16:07 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడుపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు ఘాటైన విమర్శలు చేశారు. తాను వెన్నుపోటు పొడిపించుకునేందుకు ఎన్టీఆర్‌లా అమాయకుడుని కాదంటూ స్పష్టంచేశారు.
 
జనసేన పార్టీ పోరాట యాత్రలో భాగంగా పవన్ ప్రసంగిస్తూ, 'వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు అలవాటు. లోకేశ్‌ కూడా వెన్నుపోటుతో సీఎం కావాలనుకుంటే కుదరదు. మీరు వెన్నుపోటు పొడుస్తుంటే పొడిపించుకునేందుకు నేను ఎన్టీఆర్‌లా అమాయకుణ్ని కాదు. వెన్నుపోటు రాజకీయాలపై జనసైన్యం తిరగబడుతుంది' అని వ్యాఖ్యానించారు. పైగా, రాబోయే సాధరణ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎవరుండాలి? చంద్రబాబా? జగనా? లేక నేనా? అనేది మీరే నిర్ణయించుకోండి అని వ్యాఖ్యానించారు. 
 
తెలుగుదేశం పార్టీ నేతలు లక్షన్నర కోట్లు తిన్నారని జగన్‌ విమర్శిస్తారు. అంటే రాజకీయాల్లో వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుందనేగా అర్థం. అటువంటి దోపిడీని జనసేన అరికడుతుందని పవన్ హామీ ఇచ్చారు. అసెంబ్లీ నుంచి పారిపోవడం కాదు. ప్రశ్నించాలి! అంటూ జగన్‌ను ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్

సంగీత్ శోభన్ హీరోగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments