ఓడిపోయిన చోట నుంచే పవన్ పర్యటనకు శ్రీకారం... తొలిసారి భీమవరంకు...

Webdunia
ఆదివారం, 4 ఆగస్టు 2019 (17:02 IST)
ఏదైనో పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలంటారు మన పెద్దలు. ఈ సామెతను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బాగా ఒంటబట్టించుకున్నట్టున్నారు. ఎందుకంటే.. తాను పోటీ చేసిన ఓడిపోయిన భీమవరం నుంచే ఆయన రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఓటమి తర్వాత తొలిసారిగా భీమవరానికి పవన్ కళ్యాణ్ ఆదివారం తొలిసారి వెళ్లారు. 
 
పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడారు. దేవీపట్నం పరిసర ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 
 
ఎన్నికల ఫలితాల తర్వాత క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలను ప్రారంభించినట్టుగా పవన్ కళ్యాణ్ తెలిపారు. పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడం, భవిష్యత్‌లో పార్టీ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. 
 
ఏపీ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తోంది, ప్రజలు ఏ రకమైన అభిప్రాయంతో ఉన్నారనే విషయమై ఈ సమవేశంలో చర్చించనున్నట్టుగా ఆయన తెలిపారు.
 
రాజకీయాలు హుందాగా ఉండాలని తమ పార్టీ కోరుకొంటుందని ఆయన తెలిపారు. తమ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్  కూడ అలాగే వ్యవహరిస్తున్నారని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. వరద బాధితులను ఆదుకోవాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments