Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్ టిక్కెటింగ్‌కు సినీ పెద్దలు సమ్మతించారు : మంత్రి ఆదిమూలపు

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (18:02 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు సినీ పెద్దలే సమ్మతించారని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పుకొచ్చారు. అదేసమయంలో ఆన్‌లైన్ టికెటింగ్‌పై పవన్ చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమ వారికే నచ్చడం లేదన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ఆన్‌లైన్ టిక్కెట్ల విషయంలో సినీ పరిశ్రమ మొత్తం ఒక క్లారిటీతో ఉందన్నారు. కానీ, పవన్ మధ్యలో వెళ్లి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ కేవలం సినీ పరిశ్రమకే కాకుండా మొత్తం రాష్ట్రానికే గుదిబండగా మారారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ఎన్నో పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్... కులాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తుండటం దారుణమని అన్నారు. ఎవరి కోసం పోరాడుతున్నారో, ఏ అజెండాతో ముందుకు వెళ్తున్నారో పవనే అర్థం చేసుకోవాలన్నారు. ఎన్నికలు వస్తే ఏదో ఒక అలజడి సృష్టించాలనే ఆలోచనతో పవన్ వ్యవహరిస్తుంటారని, ఆయన వాడుతున్న భాష, ఆలోచనా విధానం ప్రమాదకరంగా వున్నాయని మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamal Haasan: హే రామ్ సినిమా.. కమల్ హాసన్ లవ్ స్టోరీ గురించి చెప్పేసిన శ్రుతి హాసన్

Suchitra: షణ్ముగరాజ్‌పై ఆరోపణలు చేసిన సుచిత్ర.. అన్నీ లాగేసుకున్నాడు.. ఇన్‌స్టాలో వీడియో (video)

Lakshmi Menon: బార్‌లో గొడవ- ఐటీ ఉద్యోగినిపై దాడి, కిడ్నాప్.. అజ్ఞాతంలో లక్ష్మీ మీనన్ (video)

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments