Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనసుంటే మార్గం ఉంటుంది - వన్ ఎలక్షన్ - వన్ నేషన్‌పై పవన్ కళ్యాణ్

ఠాగూర్
సోమవారం, 26 మే 2025 (15:43 IST)
మనసుంటే మార్గం ఉంటుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వన్ ఎలక్షన్ - వన్ నేషన్‌పై సోమవారం తమిళనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో సెమినార్ జరిగింది. ఇందులో ముఖ్య అథితిగా పాల్గొన్న పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు. 
 
మనసుంటే మార్గం ఉంటుంది. ముందు ప్రారంభిస్తే మార్గం వచ్చే అడ్డంకులు అధిగమించవచ్చు. సమస్యలు లేవని చెప్పను. కానీ, వాటిని అధిగమించగలం. ఎన్నికల ఓటమిపై విపక్షాల ఆరోపణలు అర్థరహితమన్నారు. ఎన్నికల్లో గెలిచినపుడు ఒకలా.. ఓడిపోయినపుడు మరోలా మాట్లాడుతున్నాయని విమర్శించారు. 
 
ఉదాహరణకు గత 2019లో జరిగిన ఎన్నికల్లో ఏపీలో వైకాపా గెలిచింది. 2024లో జరిగిన ఎన్నికల్లో వైకాపా ఓడిపోయింది. కానీ, ఎన్నికల్లో గెలిచినపుడు ఈవీఎంల పనితీరును ప్రశంసించిన వైకాపా నేతలు 2024లో ఓటమి పాలుకావడంతో అదే ఈవీఎంలపై విమర్శలు చేస్తున్నారని ఆయన గుర్తుచేశారు. 
 
వచ్చే 2026లో జరిగే ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ కూటమి గెలవబోతోందన్నారు. ప్రధాని మోడీ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే నేత అని, ఆయన నాయకత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments