Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధర్మాన్ని పరిరక్షిద్దాం – మత సమరస్యాన్ని కాపాడుకుందాం: పవన్ సంకల్పం

Webdunia
శనివారం, 12 సెప్టెంబరు 2020 (06:27 IST)
దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకొనేందుకు శుక్రవారం సాయంత్రం 5గంటల 30నిమిషాలకు దీపాలు వెలిగించే కార్యక్రమానికి జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ శ్రీకారం చుట్టారు.

ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ స‌మీపంలోని శంక‌రాప‌ల్లిలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో శుక్ర‌వారం సాయంత్రం దీపాన్ని వెలిగించి ‘ధర్మాన్ని పరిరక్షిద్దాం – మత సమరస్యాన్ని కాపాడుకుందాం’ అని సంకల్పం చెప్పుకొంటూ ధ్యానం చేశారు.

ధర్మాన్ని రక్షించుకొనే దిశగా అందరూ అడుగులు వేయాలని పవన్ ఆకాంక్షించారు. ‘‘సాయంత్రం 5.30-6.30 మధ్య సంధ్యా సమయంలో మత సామరస్యం కోసం, ధర్మపరిరక్షణ కోసం దీపాలు వెలిగించండి.

సమస్యను, అన్యాయాన్ని అర్థం చేసుకోగల శక్తి మహిళలకు ఉంది. అందుకే ధర్మ పరిరక్షణకు, మత సామరస్యాన్ని కాపాడేందుకు మహిళలు మందుకు రావాలి’’ అని పవన్‌ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments